హార్ముజ్ జలసంధి వద్ద మళ్లీ మంటలు రేగాయి. అమెరికా, ఇరాన్ మధ్య వరుస దాడులు ప్రపంచ చమురు మార్కెట్ను వణికిస్తున్నాయి.
ఇరాన్ IRGC దళాలు ఒక కంటైనర్ షిప్పై దాడి చేసి, హార్ముజ్ జలసంధిని మూసేసినట్లు ప్రకటించాయి. దీనికి కౌంటర్గా అమెరికా 140కి పైగా ఇరాన్ సైనిక లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించింది. బందర్ అబ్బాస్, గ్రేటర్ టుంబ్ ద్వీపం లక్ష్యంగా వరుస దాడులు జరిగాయి. ఇరాన్ కూడా జోర్డాన్పై ప్రతీకార దాడులతో బదులిచ్చింది.
ప్రపంచ చమురులో 5వ వంతు ఈ జలసంధి గుండానే వెళ్తుంది. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర $87కి ఎగబాకింది. ఈ ఏడాదిలో చమురు ధరలు ఏకంగా 40% పెరిగాయి. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు $3.86కి చేరింది. ఇది భారత్లో పెట్రోల్-డీజిల్ ధరలపైనా, రవాణా ఖర్చులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ట్రంప్ మొదట 20% “టోల్ ఫీ” ప్రతిపాదించినా, తర్వాత వెనక్కి తగ్గారు. ఇరాన్ మాత్రం చర్చలకు సిద్ధంగా లేదని తేల్చిచెప్పింది. దౌత్యపరమైన పరిష్కారం దొరికే వరకు ఈ ఉద్రిక్తతలు, ధరల ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.