మీకు రాజధాని గ్రామాల్లో భూమి ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. చాలారోజులుగా స్తబ్దుగా ఉన్న అమరావతి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఒక్కసారిగా లేచింది. ఎంతలా అంటే గత ఆరు నెలల్లోనే ల్యాండ్ పూలింగ్ ప్లాట్ల ధరలు 30 నుంచి 40 శాతం పెరిగాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలే చెబుతున్న లెక్కలు.
ఏ గ్రామంలో ఎంత?
కొండరాజుపాలెం : గజం రూ.62 వేలు పైనే. కమర్షియల్ హబ్గా ప్రతిపాదించిన ఈ ప్రాంతంలో పెద్ద ప్లాట్లకు ఇదే రేటు. ప్రస్తుతానికి రాజధానిలో టాప్
వెలగపూడి : గజం రూ.50 నుంచి రూ.55 వేల వరకు
నేలపాడు పరిసరాలు : గజం రూ.47 వేల వరకు
మందడం : గజం రూ.40 నుంచి 45 వేలు
మిగతా పూలింగ్ గ్రామాలు : గజం రూ.30 నుంచి 40 వేల మధ్య లావాదేవీలు
సచివాలయం, హైకోర్టు, హెచ్ఓడీ టవర్లు.. ఈ పరిపాలనా జోన్కు ఎంత దగ్గరైతే, ధర అంత ఎక్కువ.
ఇంత సడన్గా ఎందుకు పెరిగాయి?
అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంటు బిల్లు ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ కూడా వచ్చేసింది. ‘ఇక రాజధాని మారదు‘ అనే భరోసా రావడంతో ఏళ్లుగా వేచి చూసిన కొనుగోలుదారులు ఒక్కసారిగా మార్కెట్లోకి దిగారు. గెజిట్ వచ్చిన గంటల్లోనే ధరలు కదిలాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
దానికితోడు గ్రౌండ్లో పనులు కనిపిస్తున్నాయి. రూ.55 వేల కోట్ల విలువైన నిర్మాణాలు జరుగుతున్నాయి. తాజాగా హోటళ్లకు ఎకరా రూ.8.20 కోట్ల ధరతో సీఆర్డీఏ బిడ్లు పిలిచింది. ప్రభుత్వమే భూమికి ఆ స్థాయి విలువ కడుతున్నప్పుడు, ప్రైవేట్ మార్కెట్ ఇంకెంత పరుగెడుతుందో ఊహించుకోండి.
కొనాలనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్
ధరలు పెరుగుతున్నాయని హడావుడిగా దిగిపోకండి. మూడు విషయాలు గుర్తుంచుకోండి:
ఇదీ చదవండి: హోటళ్లకు ఎకరా రూ.8.20 కోట్లు https://bezawadabulletin.com/news/540/